Breaking News

కంటి వైద్యుడికి కరోనా

వరంగల్ రూరల్ జిల్లా: రాష్ట్రంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తున్నది. జర్నలిస్టులు, వైద్యులు, ప్రభుత్వ అధికారులు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా వరంగల్​ జిల్లాకు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ మెరుగు సుధాకర్ కరోనా బారినపడ్డారు. నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో గత ఆదివారం డాక్టర్ సుధాకర్ 70 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు సమాచారం. ఆయన ప్రస్తుతం సూర్యాపేట కరోనా ప్రత్యేకాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తుండటం గమనార్హం