Breaking News

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఉందిగా..

లాక్ డౌన్ పేరుతో దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. ఈ సమస్యతో సినీపరిశ్రమకు తీరని నష్టమే కలిగింది. అలాగే ఫిల్మ్ మేకర్స్ కూడా అన్ని కార్యక్రమాలు పూర్తయినా సినిమాలు ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఈ సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్​ కే ఓటు వేస్తున్నారు చాలామంది చిత్ర నిర్మాతలు. వారి సినిమాలను డిజిటల్ ఫ్లాట్​ ఫామ్​ లో విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘అమృతారామమ్’ అనే సినిమా తెలుగులో ఇప్పటికే రిలీజ్ అయ్యింది.

ఇప్పుడు కీర్తిసురేష్ నటించిన ‘పెంగ్విన్’ కూడా ఓటీటీలో తెలుగు, తమిళ వెర్షన్స్​ లో జూన్ 19న రిలీజ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్​ తో ఒప్పదం కుదుర్చుకున్నారు నిర్మాతలు. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. ‘పెంగ్విన్’తో కలిపి మొత్తం ఏడు సినిమాలను అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.