Breaking News

ఒకే ఇంట్లో నలుగురు మృతి

WANAPARTHY

సారథి న్యూస్​, వనపర్తి: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్​లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. నాగపూర్​కు చెందిన అజీరాం బీ(63), ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా నస్రీన్​ (10) శుక్రవారం తమ ఇంట్లో మృతిచెందారు. ఇంట్లో ఈ నలుగురు విగతజీవులుగా పడిఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వంట గదిలో అజీరాం బీ, హాల్‌లో హాసీనా, డైనింగ్ హాల్‌లో ఆస్మా బేగం, ఇంటి వెనక ఖాజా పాషా మృతదేహాలు పడిఉన్నాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వీరంతా మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నారా? లేదంటే ఎవరైనా చంపేశారా? అన్న వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనతో నాగపూర్‌ గ్రామంలో విషాదం అలుముకుంది. మృతుడి ఇంటివద్ద నిమ్మకాయలు, కుంకుమ పసుపు, అగర్​బత్తీలు ఉండడంతో వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షుద్రపూజలు జరిగి ఉంటాయని స్థానికులు అనుమానిస్తున్నారు.