Breaking News

ఐసోలేషన్​లోకి మహారాష్ట్ర గవర్నర్​

ముంబై: మహారాష్ట్ర గవర్నర్​ భగత్​సింగ్​ కొశ్యారీ సెల్ఫ్​ ఐసోలేషన్​లోకి వెళ్లిపోయారు. రాజ్​భవన్​లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్​ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్​ వచ్చింది.