![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/GOVERNORMMF.jpg?fit=400%2C300&ssl=1)
ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. రాజ్భవన్లో పనిచేస్తున్న 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా త్వరలోనే ఆయనకు కరోనా పరీక్షలు చేస్తామని అధికారులు తెలిపారు. మహారాష్ట్ర గవర్నర్ కార్యాలయంలో మొత్తం 100 మందికి పరీక్షలు చేయగా 16 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.