![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/RH.jpg?fit=400%2C266&ssl=1)
న్యూఢిల్లీ: టీమిండియా టెస్ట్ ప్లేయర్ చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, స్పిన్నర్ రవీంద్ర జడేజాతో పాటు మహిళా క్రికెటర్లు స్మృతి మందన, దీప్తిశర్మకు.. జాతీయ డోపింగ్ సంస్థ (నాడా) నోటీసులు జారీచేసింది. ‘ఎప్పుడు, ఎక్కడ’ అనే క్లాజ్ను ఉల్లంఘించినందుకు నాడా చర్యలు చేపట్టింది. రాబోయే మూడు నెలలు ఎక్కడ ఉంటారో.. ముందుగానే నాడాకు తెలియజేయడమే ఈ క్లాజ్ ఉద్దేశం. దేశవ్యాప్తంగా మొత్తం 110 మంది అథ్లెట్లు నాడా రిజిస్టర్ టెస్టింగ్ పూల్ కింద నమోదై ఉన్నారు.
వీళ్లంతా ఈ క్లాజ్ను కచ్చితంగా పాటించాల్సిందే. అయితే పాస్వర్డ్ సమస్య వల్లే క్రికెటర్లు ఈ ఫారాన్ని సకాలంలో అందజేయలేకపోయారని బీసీసీఐ వెల్లడించింది. ఇందులో కావాలని చేసిన తప్పిదం లేదని చెప్పింది. అయితే బీసీసీఐ ఇచ్చిన వివరణను పరిశీలిస్తున్నామని నాడా డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. ఈ క్లాజ్కు సంబంధించిన ఫారాన్ని రెండు రకాలుగా సమర్పించవచ్చన్నారు. అథ్లెట్, లేదా అసోసియేషన్లు ఈ ఫారాన్ని దాఖలు చేయొచ్చని అగర్వాల్ స్పష్టం చేశారు.