Breaking News

ఏపీలో 9,999 కరోనా కేసులు

ఏపీలో 9,999 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 77 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779కు చేరింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 44,52,128 వ్యాధి నిర్ధారణ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకేరోజు 11,069 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 4,46,716కు చేరింది.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 557, చిత్తూరు 1,040, ఈస్ట్​గోదావరి 1,499, గుంటూరు 920, కడప 698, కృష్ణా 451, కర్నూలు 497, నెల్లూరు 778, ప్రకాశం 901, శ్రీకాకుళం 570, విశాఖపట్నం 413, విజయనగరం 594, వెస్ట్​గోదావరి 1,081 చొప్పున పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.