Breaking News

ఏపీలో 25వేల మార్క్ ​దాటిన కరోనా

ఏపీలో 25వేల మార్క్​దాటిన కరోనా

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా(కొవిడ్‌19) విజృంభిస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 1,608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్​బులెటిన్‌లో ప్రకటించింది. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 1,576 కాగా, 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కు చేరింది. వ్యాధి బారినపడి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు చనిపోయారు. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,194 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్​అయ్యారు. 11,936 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.