![ఏకపక్షంగా బదిలీలు చేసిన్రు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/NAAMA-2f.jpg?fit=564%2C605&ssl=1)
సారథి న్యూస్, ఖమ్మం: ఎలాంటి కౌన్సిలింగ్ లేకుండా జిల్లాలో వీఆర్వోలను ఏకపక్షంగా బదిలీలు చేశారని, ఈ విషయం గురించి వినతి ఇవ్వడానికి వెళ్తే ఖమ్మం కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేందర్ రావు మంగళవారం ఎంపీ నామా నాగేశ్వరావుకు ఆన్లైన్లో వినతిపత్రం పంపించారు. ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ధరణి ద్వారా కొత్త పట్టాబుక్కులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ, ఎన్నికల నిర్వహణ, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో ప్రభుత్వ సూచనలను అమలుచేస్తున్నామని ఎంపీ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎంపీ నామా వెంటనే కలెక్టర్కు ఫోన్చేసి వివరాలు తెలుసుకున్నారు.