Breaking News

ఎస్సైకి ఘనసన్మానం

సారథి న్యూస్​, హయత్​నగర్​(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎస్సైగా పనిచేసి.. ట్రాన్స్​ఫర్​పై వెళ్తున్న సైదారెడ్డిని స్థానిక వార్డుసభ్యుడు మొగుళ్ల జీవన్ రెడ్డి, టీఆర్​ఎస్​ నాయకుడు మొగుళ్ల వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. మూడేళ్లపాటు ఇక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో విశేషసేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎం.నరేష్ గౌడ్, ఎండీ ఇమ్ము, వినీత్ గౌడ్, అఖిల్ రెడ్డి, సందీప్, అజయ్, సాధిక్, మహేష్ పాల్గొన్నారు.