Breaking News

ఎమ్మెల్యే మాటలు హాస్యాస్పదం

ఎమ్మెల్యే మాటలు హాస్యాస్పదం

సారథి న్యూస్, హుస్నాబాద్ : స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ గౌరవెళ్లి ప్రాజెక్టును నెల రోజుల్లో నీటితో నింపుతామనడం హాస్యాస్పదమని భూ నిర్వాసితులు అన్నారు. ఈ సందర్భంగా గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని గుడాటిపల్లిలో భూ సేకరణ సమస్యలున్నాయని తెలిపారు. నీటిని తోడే భారీ మోటార్ రావడానికి డిసెంబర్ పడుతుందన్న ఎమ్మెల్యే, పలు సమావేశాల్లో నెల రోజుల్లోనే నీటితో ప్రాజెక్టు నింపుతామడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కార్యక్రమంలో భూనిర్వాసితులు తిరుపతిరెడ్డి, తిరుమలరెడ్డి, బాలయ్య, మధురవ్వ, లచ్చవ్వ, సంపత్, భాస్కర్, సంపత్ రెడ్డి, జి.వెంకటేశం, మాధవరెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.