![ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఔదార్యం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/MJR-2.jpg?fit=677%2C357&ssl=1)
- గిరిజన విద్యార్థిని మెడిసిన్ చదువుకు ఆర్థిక సాయం
- ప్రతి సంవత్సరం రూ.60వేలు అందజేస్తానని హామీ
సారథి న్యూస్, నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మెడిసిన్ చదువుతున్న బిజినేపల్లి మండలంలోని ఉడుగులకుంట తండాకు చెందిన కాట్రావత్శ్యామల అనే విద్యార్థినికి ఎంజేఆర్ ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఏటా చదువుల కోసం రూ.60వేలు ఇస్తానని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మొదటి సంవత్సరం ఫీజు రూ.60వేల చెక్కును విద్యార్థిని తండ్రి పాండుకు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ చందులాల్, నాగరాజు పాల్గొన్నారు.