Breaking News

ఈఎస్ఐలో కేంద్ర బృందం

ఈఎస్ఐలో కేంద్ర బృందం
  • కరోనా వైద్యంపై ఆరా

సారథి న్యూస్, హైదరాబాద్: జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్రబృందం శ‌నివారం ఎర్రగడ్డలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని సంద‌ర్శించింది. ఈ సంద‌ర్భంగా డీన్ డాక్టర్ శ్రీ‌నివాస్‌, సూప‌రింటెండెంట్ డాక్టర్ పాల్‌, ఇత‌ర వైద్యాధికారుల‌తో క‌లిసి ఈఎస్‌ఐ ఆస్పత్రిలోని వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు.

కోవిడ్‌-19 పాజిటివ్ కేసుల‌కు వైద్యసేవ‌ల ఏర్పాట్ల గురించి వాక‌బుచేశారు. అనంత‌రం చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా గోడౌన్​ ను ప‌రిశీలించి బియ్యం నిల్వల గురించి తెలుసుకున్నారు. బృందంలో కేంద్ర ప్రజారోగ్య సీనియ‌ర్ వైద్యులు డాక్టర్​ చంద్రశేఖ‌ర్ గెడం, జాతీయ పోష‌కాహార సంస్థ డైరెక్టర్ డాక్టర్​ హేమ‌ల‌త‌, వినియోగ‌దారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, జాతీయ విప‌త్తు నివార‌ణ సంస్థ అసోసియేట్ ప్రొఫెస‌ర్ శేఖ‌ర్ చ‌తుర్వేది తదితరులు ఉన్నారు.