Breaking News

ఇన్​సెంటివ్​, జీతం ఇవ్వండి


సారథి న్యూస్, రామాయంపేట: కరోనా విధుల్లో ఫస్ట్ వారియర్స్ గా ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు సీఎం కేసీఆర్ రూ.ఐదువేల ఇన్​సెంటివ్​ ప్రకటించగా, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇన్​సెంటివ్​తో పాట పెరిగిన రూ.8,500 జీతం ఇవ్వాలని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన బాటపట్టారు. సోమవారం రాత్రి మెదక్​ జిల్లా ఉమ్మడి రామాయంపేట మండలాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఆయా పంచాయతీ ఆఫీసుల వద్ద ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, జీవోనం.51 పేరుతో కార్మికుల సంఖ్యను తగ్గించడం సరికాదన్నారు. ఈనెల 19,22 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయతీలు, ఎంపీడీవో, డీపీవో ఆఫీసుల ఎదుట నిరసనలు వ్యక్తంచేస్తామని తెలిపారు.