Breaking News

ఇతర రాష్ట్రాల నుంచి రానివ్వొద్దు

ఇతర రాష్ట్రాల నుంచి రానివ్వొద్దు

సారథి న్యూస్, కల్వకుర్తి: కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ డౌన్ ను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఆర్డీవో రాజేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన జిల్లాలోని వెల్దండ పోలీస్ చెక్ పోస్టును సందర్శించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి రానివ్వకూడదని ఆదేశించారు.

మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరూ బయటికి రావొద్దని, అత్యవసర పనులపై వచ్చినా మాస్క్ కచ్చితంగా కట్టుకోవాలని ఆర్డీవో సూచించారు. ఆయన వెంట వెల్దండ తహసీల్దార్ సైదులు, ఎస్సై నర్సింహులు ఉన్నారు.