![ఇక అభివృద్ధి పనులపై దృష్టిపెట్టండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/KNL-32F.jpg?fit=1250%2C473&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలో కరోనా కట్టడికి అధికారులు, సిబ్బంది బాగా కృషిచేశారని, ఇకపై అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఆర్డీవోలు, మండలాధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చిన వారికి కొత్తగా జాబ్కార్డులు ఇవ్వాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి హోం ఐసోలేషన్లో ఉండేందుకు ప్రోత్సహించారు. అనంతరం జేసీ రవిపట్టాన్ శెట్టి మాట్లాడుతూ.. ఈ క్రాప్నమోదు చేయాలని, జిల్లాలో ఈనెల 20 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు కౌలురైతు కార్డుల జారీపై అవగాహన సదస్సు నిర్వహించాలన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్విలేజ్ క్లినిక్స్, అంగన్వాడీ భవన నిర్మాణాలకు స్థలాలను గుర్తించాలని సూచించారు. సమావేశంలో అనంతరం జేసీ2(అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి, జేసీ3 (ఆసరా, సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ, డీఆర్వో పుల్లయ్య పాల్గొన్నారు.