Breaking News

అభాగ్యురాలికి చేయూత

షార్ట్ న్యూస్

సారథి న్యూస్, చొప్పదండి: జన్యుపరమైన వ్యాధితో ఇబ్బందులు బాధపడుతున్న ఓ యువతికి సెల్​పాయింట్ యూనియన్​ సభ్యులు ఆర్థిక సాయం అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. కరీంనగర్​ జిల్లా కొత్తపల్లికి చెందిన సిరిపురం ప్రసాద్​, రూప కూతురు జాహ్నవి డిగ్రీ చదువుతోంది. ఆమె కొంతకాలంగా జన్యుపరమైన వ్యాధితో బాధపడుతోంది. వైద్యానికి నెలకు రూ.ఆరువేలు ఖర్చవుతున్నది. తల్లిదండ్రులు పేదరికంతో బాధపడుతున్నారు. దీంతో చొప్పదండి సెల్​పాయింట్​ యూనియన్​ బాధిత కుటుంబానికి రూ.ఆరువేలు ఆర్థికసాయం అందించగా.. కానిస్టేబుల్​ శ్రీనివాస్​ రూ.వెయ్యి ఆర్థికసాయం అందించారు.