Breaking News

ఆగస్ట్​ నుంచి బ్యాడ్మింటన్​ టోర్నీ

  • సిద్ధమైన వరల్డ్​ ఫెడరేషన్​

న్యూఢిల్లీ: పోస్ట్​ కరోనాలో బ్యాడ్మింటన్​ను మొదలుపెట్టేందుకు బ్యాడ్మింటన్​ వరల్డ్​ ఫెడరేషన్​ (బీడబ్ల్యూఎఫ్​)రెడీ అయింది. అందుకోసం ఈ ఏడాది మిగిలిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్​ షెడ్యూల్​ను ప్రకటించింది. ఆగస్ట్​ 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్​ ఓపెన్​తో బ్యాడ్మింటన్​ క్రీడ మొదలుకానుంది. నవంబర్​ 17–22వ తేదీ వరకు సయ్యద్​ మోడీ ఇంటర్​నేషనల్​ టోర్నీ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్​ క్వాలిఫయింగ్​ టోర్నీ ఇండియా ఓపెన్​కు డిసెంబర్​ 8న తెరలేవనుంది.

ఓవరాల్​గా ప్రధానమైన 8టోర్నీలను రీషెడ్యూల్​ చేశారు. న్యూజిలాండ్‌ ఓపెన్‌ సూపర్‌–300, ఇండోనేసియా ఓపెన్‌, మలేసియా ఓపెన్‌, థాయ్‌లాండ్‌ ఓపెన్‌, వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్​ ఇందులో ఉన్నాయి. మరోవైపు బీడబ్ల్యూఎఫ్​ రివైజ్డ్​ షెడ్యూల్​పై టాప్​ షట్లర్లు సైనా, కశ్యప్​, ప్రణీత్​, ప్రణయ్​ నిరాశ వ్యక్తంచేశారు. ఇంతవరకు ప్రాక్టీసే మొదలుపెట్టలేదని, అలాంటప్పుడు ఐదు నెలలో 22 టోర్నీలు ఎలా సాధ్యమవుతాయని విమర్శించారు.