Breaking News

ఆగస్టు 14 వరకు లాక్​డౌన్​

ఆగస్టు 14వరకు లాక్డౌన్

సారథి న్యూస్​, కోదాడ : పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు దృష్ట్యా ఈ నెల 31నుంచి ఆగస్టు 14వరకు లాక్​డౌన్​ విధించనున్నట్లు కోదాడ మున్సిపల్​ కమిషనర్​ మల్లారెడ్డి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వైరస్​ను కట్టడి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్​, రెవెన్యూ, పోలీసుల సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసర సేవలకు, మెడికల్​ షాపులకు లాక్​ డౌన్​ నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ15రోజులపాటు స్వీయ నిర్బంధం పాటించాలని కమిషనర్​ కోరారు.