![అశోక్ గెహ్లాట్కు ఈడీ షాక్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ashok-ed-final.jpg?fit=679%2C371&ssl=1)
జైపూర్: సచిన్ పైలట్ సృష్టించిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్కు ఈడీ షాక్ ఇచ్చింది. అతడి సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్కు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సమన్లు జారీచేసింది. అగ్రసేన్ రూ.150 కోట్ల ఎరువుల కుంభకోణానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అగ్రసేన్ను ప్రశ్నించనుంది. ఈనెల 22న ఈడీ అధికారులు అగ్రసేన్కు చెందిన ఎరువుల కంపెనీపై దాడి చేసి.. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ.. ఈడీని అడ్డం పెట్టుకొని కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది. ఈడీ తనిఖీలకు బీజేపీకి ఏ విధమైన సంబంధం లేదని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.