న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ సంఘం(బాయ్)పై విమర్శలు గుప్పించిన స్టార్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ పేరును ‘అర్జున’ అవార్డుకు చీఫ్ కోచ్ గోపీచంద్ సిఫారసు చేశాడు. ఖేల్రత్న హోదాలో అతడి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నెల 3న ప్రణయ్ పేరును సిఫారసు చేసినా ఆలస్యంగా ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, సమీర్ వర్మ పేర్లను బాయ్ ఇప్పటికే అర్జునకు సిఫారసు చేసింది. అయితే తనను పట్టించుకోలేదన్న కోపంతో ప్రణయ్.. బాయ్ పై తీవ్రమైన విమర్శలు చేశాడు. దీంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ప్రణయ్కు బాయ్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
- June 22, 2020
- Archive
- క్రీడలు
- Comments Off on ‘అర్జున’కు ప్రణయ్ : గోపీచంద్