Breaking News

అమరుల సాక్షిగా పాలమూరుకు అన్యాయం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన ఆరేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ మహబూబ్​ నగర్ జిల్లా కార్యదర్శి పరమేశ్​ గౌడ్ విమర్శించారు. పార్టీ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరణ​ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలుకాలేదని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణపై ఆయన ప్రేమ లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు డి.బాలకిషన్, పి.సురేష్, రైతుసంఘం జిల్లా నాయకులు చాంద్ పాషా, బీఆర్ విల్సన్, డ్యాం అంజి, గూడు పాషా, ఖాజా పాల్గొన్నారు