Breaking News

అమరవీరుడికి ఘన నివాళి

సారథి న్యూస్​, ఎల్బీనగర్: భారత్– చైనా సరిహద్దులో అమరుడైన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబు చిత్రపటానికి అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ హయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు ఉగాది ఎల్లప్ప ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్ రెడ్డి, మన్సూరాబాద్ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ యాదగిరి యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సంఘీ అశోక్, చారి, జనార్దన్, ఉగాది బల్లు, పిడుగు ప్రవీణ్, ప్రేమ్, ఉజ్వల్ శివాజి, శంకర్, రవి తేజ, ఆశిష్ తదితరులు పాల్గొన్నారు.