![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/anupam-kherff.jpg?fit=760%2C443&ssl=1)
ముంబై: కరోనా మహమ్మారి బాలీవుడ్ సినీప్రముఖులను వణికిస్తున్నది. ఇప్పటికే బిగ్బీ అమితాబ్బచ్చన్, అతడి కుమారుడు అభిషేక్ బచ్చన్కు కరోనా సోకగా.. తాజాగా బాలీవుడ్ విలక్షణనటుడు అనుపమ్ ఖేర్ కుటుంబసభ్యులకు కరోనా సోకింది. అనుపమ్ తల్లికి, అతడి సోదరుడికి మరో ఇద్దరు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయన్ని స్వయంగా అనుపమ్ఖేర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నా తల్లి, సోదరుడు, వదిన, మేనకోడలుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా దవాఖానలో చికిత్స పొందుతున్నారు’ అని అనుపమ్ఖేర్ ట్వీట్ చేశాడు.