Breaking News

అనంతలో తిరుపతి లడ్డూ

  • బారులు తీరిన భక్తులు
  • మధ్యాహ్నానికే 20 వేల లడ్డూల విక్రయం

సారథి న్యూస్, అనంతపురం‌: రెండు నెలలుగా తిరుమలేశుడి దర్శనం లేకపోవడం, పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదం అందుబాటులో లేకపోవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీవారి లడ్డూలను జిల్లా కేంద్రానికే తీసుకొచ్చి పంపిణీ చేపట్టడంతో లడ్డూల కోసం భక్తులు బారులు తీరారు. మంగళవారం స్థానిక రామచంద్రానగర్‌లోని టీటీడీ కల్యాణ మండపంలో ఉదయం నుండి శ్రీవారి లడ్డూల విక్రయం జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జిల్లా కేంద్రానికి 20వేల లడ్డూలు వచ్చినా మధ్యాహ్నం లోపు అయిపోవడంతో చాలా మమంది భక్తులు నిరాశ చెందారు. తిరుమల నుంచి ప్రత్యేక అధికారిగా వచ్చిన ఏఈవో రాజేంద్రకుమార్, జిల్లా ధర్మప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాదవేణు, కార్యదర్శి నాగేశ్వరి, టీటీడీ మేనేజర్‌ రామమోన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ స్వామి వారి దర్శనం లేక ఇబ్బంది పడుతున్న భక్తులకు శ్రీవారి లడ్డూలనైనా అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. రేపు మరో పదివేల లడ్డూలను తెప్పిస్తున్నామన్నారు.