Breaking News

అంత్యక్రియలకు ఆమడదూరం

సారథి న్యూస్​, కోదాడ : సూర్యాపేట జిల్లా సాలార్​జంగ్​పేటకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్​ రావడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. కానీ పరిస్థితి విషమించి సోమవారం ఆస్పత్రిలోనే చనిపోవడంతో అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశానుసారం అధికారులు, సిబ్బంది సహాయంతో రాత్రి 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్​స్పెక్టర్ దండు శ్రీను , హెల్త్ అసిస్టెంట్ మేరిగ అశోక్, జవాన్లు సిబ్బంది పాల్గొన్నారు.