![వాళ్లిద్దర్ని ఆపడం కష్టం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/kul.jpg?fit=299%2C168&ssl=1)
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్లో ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివియర్స్ను ఆపడం కష్టమని భారత మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఈ ఇద్దరికి బౌలింగ్ చేయడం కత్తిమీద సామేనని చెప్పాడు. ఈ ఇద్దరిలో తమకు మాత్రమే సాధ్యమైన ప్రత్యేక నైపుణ్యాలు ఉన్నాయన్నాడు. ‘స్మిత్ ఎక్కువగా బ్యాక్ ఫుట్ ఆడతాడు. బంతిని కూడా చాలా ఆలస్యంగా ఎదుర్కొంటాడు. దీనివల్ల బంతిని ఏ వైపు టర్న్ చేయాలన్న దానిపై సందిగ్దం తలెత్తుంది. వన్డేల్లో ఏబీ మంచి ప్లేయర్. అతనికి ఓ భిన్నమైన శైలి ఉంది. బంతి ఎక్కడేసినా.. వెంటాడి మరి చితక్కొడతాడు. ఇప్పుడు అతను రిటైర్డ్ అయ్యాడు కాబట్టి బాధలేదు. ఈ ఇద్దరు మినహా నా బౌలింగ్లో ఎక్కువ పరుగులు తీసిన బ్యాట్స్మెన్ ఎవరూ లేరు. వేరే వాళ్లకు బౌలింగ్ చేయడానికి కూడా నేను భయపడలేదు’ అని కుల్దీప్ వివరించాడు. టీమ్లో నిలకడగా అవకాశాలు రాకపోవడం, కొన్ని నైపుణ్యాలను మర్చిపోవడం వల్లే గతేడాది విఫలమయ్యానన్నాడు. సహచరుడు యజ్వేంద్ర చహల్తో తనకు ప్రత్యేకమైన బంధం ఉందన్నాడు. మైదానంలో, బయట చాలా విలువైన సలహాలు ఇస్తాడని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.