![తల్లిదండ్రులు మందలించారని..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/gdl2f.jpg?fit=549%2C450&ssl=1)
సారథి న్యూస్, గద్వాల: తల్లిదండ్రులు మందలించారని ఓ బాలుడు(16) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గద్వాల పట్టణ ఎస్సై రమాదేవి కథనం మేరకు.. గద్వాల పట్టణం హాట్కర్ వీధిలో నివసించే ఓ బాలుడు రెండు రోజులుగా సెల్ ఫోన్ లో ఆన్లైన్ క్లాసులు వినకుండా గేమ్స్ ఆడుతుండడంతో ఇది గమనించిన తల్లిదండ్రులు మందలించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలుడు ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్నాడని గద్వాల టౌన్ ఎస్సై రమాదేవి తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.