![చికిత్స పొందుతూ మహిళ మృతి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/12/mdk-2.jpg?fit=658%2C335&ssl=1)
సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఓ మహిళ మృతిచెందింది. ఈ సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నారాయణఖేడ్ మండలం పిప్రితండాకు చెందిన మారోని బాయ్ (55)కి బీపీ ఎక్కువై అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆమె అర్ధరాత్రి సమయంలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు, బంధువులు వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని ఆస్పత్రిపై దాడిచేసి అద్దాలు, ఫర్నిచర్ పగలగొట్టి ఆస్పత్రి ఎదుట నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న పెద్దశంకరంపేట ఎస్సై సత్యనారాయణ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు.