![హంద్రీ, తుంగభద్ర నీటిశుద్ధికి శ్రీకారం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/TUNGA-2.jpg?fit=677%2C397&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: నగరంలోని స్థానిక జమ్మిచెట్టు సమీపంలో ఉన్న హంద్రీ నది వద్ద అమృత్ పథకం నిధులతో మురుగు నీటి శుద్ధికి రూ.47.93కోట్లతో పనులను ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, మున్సిపల్కా ర్పొరేషన్కమిషనర్ డీకే బాలాజీ ఆదివారం ప్రారంభించారు. హంద్రీ, తుంగభద్ర నుంచి వచ్చే మురుగు నీరు డైరెక్ట్గా వెళ్లిపోవడం ద్వారా తాగినవారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. తుంగభద్ర హంద్రీ నీటిలో ఒక్క చుక్క వృథా కాకుండా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది, 15వ వార్డు సమన్వయకర్త కేదార్ నాథ్, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.