![వలస కూలీలకు సరుకులు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/04/mdk-asp.jpeg?fit=1280%2C960&ssl=1)
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నాగరాజు వలస కూలీలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన పట్టణంలోని మార్కెట్లో తిరిగి కూరగాయల ధరలను అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు సూచనలు చేశారు. తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్, స్థానిక సీఐ నాగయ్య, ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.