Breaking News

యాదగిరి మృతి తీరనిలోటు

సారథి న్యూస్​, హుస్నాబాద్: జానపద కళాకారుడు గడిపె యాదగిరి మరణం కళారంగానికి తీరనిలోటని తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు గడిపె మల్లేష్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ యాదగిరి చిన్నతనం నుంచి అక్షర ఉజ్వల, వరకట్నం, సారా నిషేధం, కుటుంబ నియంత్రణ, పర్యావరణం సామాజిక చైతన్య గీతాలతో పాటు ఉషోదయ కల్చరల్ అసోసియేషన్ లో నృత్యాలు, పాటలు పాడాడన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సాంస్కృతిక సారథిలో ఉద్యోగం వస్తుందని ఎన్నో కలలుగన్నాడన్నారు. నేటికీ ఉద్యోగం రాకపోవడంతో తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడని గుర్తుచేశారు. అనంతరం కళాకారులు కరకాల శంకర్, బత్తుల చంద్రమౌళి, గడిపె చిన్న, ఓద్దిరాల బాలయ్య యాదగిరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.