సారథిన్యూస్, రామడుగు: సాంకేతికరంగం కొత్తపుంతలు తొక్కుతున్న ప్రస్తుత తరుణంలో మోసాలు సైతం అదే తరహాలో జరుగుతున్నాయి. తాజాగా ఓ యువకుడు తెలుగు మ్యాట్రిమోనిలో పరిచయమైన యువతి చేతిలో దారుణంగా మోసపోయాడు. అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. రామడుగుకు చెందిన ఓ యువకుడికి తెలుగు మ్యాటిమోనిలో ఓ యువతి పరిచయమైంది. తాను అమెరికాలో ఉంటున్నానంటూ పరిచయం చేసుకున్న యువతి..పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, డైమండ్ రింగ్, యుస్ డాలర్స్ పంపుతానని యువకుడిని నమ్మించింది. అనంతరం ఆ వస్తువులును కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని.. అవి కావాలంటే అధికారులకు కొంత లంచం ఇవ్వాలని యువకుడిని నమ్మించింది. కస్టమ్స్ అధికారులకు కట్టుందుకు రూ. 4,36,600 వేలు పంపాలని చెప్పింది. అది నమ్మిన యువకుడు దఫాల వారిగా ఆమెకు డబ్బులు పంపించాడు. ఎన్నిరోజులైనా వస్తువులు అందకపోవడంతో సదరు యువతికి ఫోన్ చేశాడు. దీంతో మళ్లీ రూ. మూడు లక్షలు పంపాలంటూ ఆమె కోరడంతో.. అనుమానం వచ్చిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు రామడుగు ఎస్సై అనూష తెలిపారు.
- August 23, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- CRIME
- KARIMNAGAR
- LADY
- MONEY FRAUD
- ONLINE
- ఆన్లైన్
- కరీంనగర్
- మోసం
- మ్యాట్రిమోని
- Comments Off on మ్యాట్రిమోనిలతో జాగ్రత్త..!