![ముంబైని వీడిన క్వీన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/QUEEN-2.jpg?fit=677%2C381&ssl=1)
ముంబై: పలు నాటకీయ పరిణామాల మధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్… సోమవారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మహారాష్ట్ర గవర్నర్భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. ఆమె.. తన ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయడం, శివసేన నాయకుల బెదిరింపులు, తదితర విషయాలను ఆయనకు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఆమె సోమవారం తన స్వస్థలం హిమాచల్ప్రదేశ్లోని మనాలికి పయనమయ్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయకుడు సంజయ్రౌత్కు సవాల్, సీఎం ఉద్దవ్థాక్రేపై విమర్శల కారణంగా కొద్దిరోజులుగా ఆమె టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విషయం విదితమే.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/QUEEN.jpg?resize=640%2C360&ssl=1)