టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్
న్యూఢిల్లీ: భారీ షాట్లు కొట్టే శక్తి, సామర్థ్యాలు ఉన్నా టెస్ట్ క్రికెట్ అంటేనే తనకు చాలా ఇష్టమని టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అన్నాడు. ఈ ఫార్మాట్లో ఆడడం కత్తిమీద సాము అని చెప్పాడు.
‘క్రికెటర్ సత్తా తెలియాలంటే టెస్ట్లు ఆడాలి. ఎందుకంటే ఇక్కడ మనల్ని పరీక్షించుకునే అవకాశం లభిస్తుంది. నాలుగు రోజుల మ్యాచ్ ఆడే రోజుల్లో ఇదే పెద్దపరీక్ష అనే మాటలు వినేవాడిని. కానీ ఐదు రోజుల క్రికెట్ ఆడాకే అసలు పరీక్ష ఏమిటో తెలిసింది.
ఈ ఫార్మాట్ లో రాణించాలంటే అదనపు శక్తి, శ్రమ, నైపుణ్యం చాలా అవసరం. అందుకే నాకు టెస్టులంటే చాలా ఇష్టం. ఇందులో ఆడాలని బాగా కోరుకుంటా’ అని పంత్ వ్యాఖ్యానించాడు. గతేడాది ఐపీఎల్ సందర్భంగా గంగూలీ ఇచ్చిన సలహాలు, సూచనలు బాగా పనిచేశాయన్నాడు. ఇప్పటికీ వాటిని పాటిస్తున్నానని చెప్పాడు.