Breaking News

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు, పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కొనియాడారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం శనివారం మెదక్​ జిల్లా కొల్చారంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్ లో ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సన్మానించి సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్​లు అందజేశారు.