సారథి న్యూస్, ఎల్బీనగర్(రంగారెడ్డి): గిరిజన యువతిపై అత్యాచారం జరిగిన ఘటనపై గవర్నర్ స్పందించాలని ఎరుకల అభివృద్ధి సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కండెల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని మన్సురాబాద్ డివిజన్, నాంచారమ్మ బస్తీలో ఎరుకల అభివృద్ధి సేవా సంఘం అధ్యర్యంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. గిరిజన యువతిపై 139 మంది అత్యాచారం చేసిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళపై లైంగికదాడి చేసిన వారిని శిక్షించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని, విచారణ మాత్రం నామమాత్రంగా జరుగుతుండడం బాధాకరమన్నారు. అగ్రకులాలకు శిక్ష ఒకరంగా, దళితులకు మరొరకంగా ఉండకూడదని న్యాయం అందరికి ఒకేలా ఉండాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న దళిత మంత్రులు గిరిజన మహిళపై జరిగిన అన్యాయంపై స్పందించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో గిరిజన మహిళలు, మహిళా సంఘాల నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు.
- August 28, 2020
- Archive
- Top News
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- 139 మంది రేప్
- ERUKALASENA SANGAM
- GOVERNER
- RAPECASE
- TELANGANA
- TRIBAL GIRL
- ఎరుకల సేవా సంఘం
- గవర్నర్
- గిరిజన యువతి
- Comments Off on గిరిజన యువతిపై రేప్.. గవర్నర్ స్పందించాలి