సారథి న్యూస్, మానవపాడు: కొంతమంది కరోనాను చాలా తేలికగా తీసుకుంటున్నారని మహమ్మారిపై అలసత్వం ఏ మాత్రం పనికిరాదని జోగుళాంబ గద్వాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ సునీత పేర్కొన్నారు. కరోనాపై అలసత్వం వహిస్తే అది మన ప్రాణాలనే హరిస్తుందని చెప్పారు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సోమవారం మానవపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మానవపాడు మండలంలో సోమవారం ఒక్కరోజే 24 పరీక్షలు చేయగా 12 మందికి కరోనా సోకిందని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్లు దివ్య, సవిత, సూపర్వైజర్లు చంద్రన్న, సత్యనారాయణ పాల్గొన్నారు.
- August 3, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- GADWAL
- TESTS
- TREATMENT
- పరీక్షలు
- మానోపాడు
- Comments Off on కరోనా.. అలసత్వం వద్దు