![అయ్యో.. నంబర్ 1 పాయే](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/virat.jpg?fit=696%2C464&ssl=1)
ర్యాంక్స్ ప్రకటించిన ఐసీసీ
దుబాయ్: టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గల్లంతైంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో విరాట్ సేన 114 రేటింగ్ పాయింట్లతో మూడవ స్థానానికి పడిపోయింది. ఆస్ర్టేలియా 116 పాయింట్లతో కొత్తగా అగ్రస్థానంలోకి దూసుకురాగా, న్యూజిలాండ్ (115) రెండవ ర్యాంక్ లో నిలిచింది.
2016 అక్టోబర్ లో తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ ను చేజిక్కించుకున్న టీమిండియా దాదాపు 42నెలల పాటు ఈ ర్యాంక్ లో కొనసాగింది. అయితే ఐసీసీ రూల్ ప్రకారం 2016–17 సీజన్ లో ఇండియా సాధించిన 12 టెస్ట్ విజయాలు, ఒక ఓటమిని తాజా ర్యాంకింగ్స్ లో పరిగణనలోకి తీసుకోకపోవడంతో నంబర్ వన్ ర్యాంక్ చేజారింది. తాజా ర్యాంకింగ్స్ కు సంబంధించి 2019 మే నుంచి ఆడిన మ్యాచ్ లకు 100 శాతం, రెండేళ్ల ప్రదర్శనకు 50 శాతం రేటింగ్ పాయింట్ల పరిగణనలోకి తీసుకుంది. ఇక ఆస్ట్రేలియా (278) టీ 20ల్లో తొలిసారి నంబర్ వన్ ర్యాంక్ ను కైవసం చేసుకుంది.
ఇంగ్లండ్(268), ఇండియా (266), పాకిస్థాన్(260), సౌతాఫ్రికా (258) వరుసగా టాప్–5లో కొనసాగుతున్నాయి. వన్డేల్లో ఇంగ్లండ్(127) నంబర్వన్ ర్యాంక్ నిలబెట్టుకుంది. రెండవ స్థానంలో ఉన్న ఇండియా(119) కంటే 8 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. న్యూజిలాండ్(116), సౌతాఫ్రికా (108), ఆస్ట్రేలియా (107) వరుసగా మూడు, నాలుగు, ఐదు ర్యాంకుల్లో ఉన్నాయి.