![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/05/GAMB.jpeg?fit=760%2C443&ssl=1)
టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్
ముంబై: ఇప్పటితో పోలిస్తే అప్పట్లో వన్డే ఫార్మాట్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. అందుకే ఈ ఫార్మాట్లో విరాట్ కంటే సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ ఆటగాడని చెప్పాడు. ఇప్పటికీ వన్డేల్లో మాస్టర్ ను ఢీకొట్టే మొనగాడే లేడన్నాడు. ‘సచిన్ ఆడే సమయంలో నిబంధనలు చాలా కఠినంగా ఉండేవి. ఒకటే వైట్ బంతి, 30 యార్డ్ సర్కిల్లో నలుగురు, బయట ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడున్న క్రికెట్ మొత్తం బ్యాట్స్ మెన్కు అనుకూలంగా మారింది. ప్రతి ఇన్నింగ్స్లో రెండు కొత్త బంతులు. బయట నలుగురు ఫీల్డర్లే ఉంటున్నారు. దీనివల్ల బ్యాట్స్ మెన్ ఈజీగా పరుగులు సాధిస్తున్నాడు. మూడు పవర్ ప్లే నిబంధనలు కూడా బ్యాట్స్ మెన్ కే అనుకూలంగా ఉన్నాయి. కొత్త బాల్స్, రివర్స్ స్వింగ్, ఫింగర్ స్పిన్ మచ్చుకైనా కనిపించడం లేదు. కఠిన నిబంధనలు ఉన్నా.. సుదీర్ఘకాలం ఈ ఫార్మాట్లో ఆడడం వల్ల సచినే తన ఫేవరెట్ అని తెలిపాడు. అప్పట్లో 230, 240 పరుగులు చేస్తే అలవోకగా గెలిచేవాళ్లమన్నాడు.