Breaking News

ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

ఎమ్మెల్సీగా వాణిదేవిని గెలిపించండి

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): మహబూబ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ​పట్టభద్రుల నియోజకవర్గ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సురభివాణి దేవిని అధిక మెజార్టీతో గెలిపించాలని జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ ​సరిత తిరుపతయ్య పట్టభద్రులను కోరారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్ నియోజకవర్గంలో మానవపాడు మండలం, పల్లెపాడు, బోరవెల్లి, చండూర్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వాణిదేవికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరించారు. కార్యక్రమంలో మనపాడు మండల సింగిల్​విండో చైర్మన్ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్​ల సంఘం మండలాధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి, నాగర్ దొడ్డి వెంకట్రాములు, పల్లెపాడు శంకర్ రెడ్డి, బీచుపల్లి, సూర్యగౌడ్, చండూర్ సర్పంచ్ నరసింహ, బోరవెల్లి సత్యరెడ్డి, మాజీ సర్పంచ్ అయ్యన్న, సీతారాములు పాల్గొన్నారు.