Breaking News

నిరుద్యోగభృతి హర్షణీయం

నిరుద్యోగభృతి హర్షణీయం

సారథి న్యూస్, చిన్నశంకరంపేట: టీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ యువ నాయకులు అత్వెల్లి నాగరాజు అన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం పలు అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టిన తమ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. నిరుద్యోగుల కోసం భృతి ప్రవేశపెట్టడం హర్షణీయమన్నారు. ప్రతిపక్షాలు చేసే అర్థరహితమైన విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయంలో కనిపించని నాయకులు ఉద్యమకారులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.