Breaking News

సింటమ్స్ ఉంటే చెప్పండి

సింటమ్స్ ఉంటే చెప్పండి

– హుస్నాబాద్ లో ఇంటింటి సర్వే…వార్డు సభ్యులకు కౌన్సిలర్ సూచనలు  

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి డా. రవి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వేను పరిశీలించి మాట్లాడారు. వార్డుల్లో ఎవ్వరికైన కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా చెప్పుకుంటే సరైన వైద్యం అందిస్తామన్నారు. పాజిటివ్ సింటమ్స్ ఉండి చెప్పకుండా వివిధ శుభకార్యక్రమాలు, పర్వదినాలకు హాజరవ్వడం ద్వారా మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వార్టుసభ్యులు అనేకంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తోందన్నారు. కొవిడ్ నిబంధనలకు ప్రకారం ప్రజలేవ్వరూ మాస్కు లేకుండా బయట తీరగొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ గడిపె సుమలత, అంగన్ వాడి టీచర్త జాల రాజేశ్వరి, ఆశ కార్యకర్త గడిపె జ్యోతి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.