సారథి, పెద్దశంకరంపేట: విధినిర్వహణలో ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవలు ఎంతో గుర్తింపునిస్తాయని సంగారెడ్డి డివిజన్ తపాలాశాఖ మెయిల్ వర్షన్ శ్రీనివాస్, పెద్దశంకరంపేట ఎస్ పీఎం అనిల్ కుమార్ అన్నారు. సోమవారం పెద్దశంకరంపేట తపాలా శాఖ కార్యాలయంలో జీడీఎస్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన సాయగౌడ్ ను సిబ్బంది సన్మానించారు. తపాలాశాఖలో 42 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఉద్యోగులంతా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బీపీఎంలు మానయ్య, విజయ్, సాయిరాం, గంగారాం, సిబ్బంది శంకర్, నిరంజన్, రవివర్మ పాల్గొన్నారు.
- June 14, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- PEDDASHANKARAMPET
- POSTAL DEPARTMENT
- SANGAREDDY
- తపాలాసేవలు
- పెద్దశంకరంపేట
- సంగారెడ్డి డివిజన్
- Comments Off on చేసిన సేవలతోనే గుర్తింపు