![పీవీ చిరస్మరణీయుడు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/2.jpg?fit=655%2C399&ssl=1)
సారథి, రామడుగు: దివంగత మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు చిరస్మరణీయుడని పలువురు నేతలు కొనియాడారు. సోమవారం కరీంనగర్జిల్లా రామడుగు మండల కేంద్రంలో దివంగత పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై తాండ్ర వివేక్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా నేతలు కోరారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు బొమ్మరవేని తిరుపతి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/1-1.jpg?resize=640%2C497&ssl=1)