Breaking News

‘ప్రగతి’ నాగేశ్వర్​రావు కన్నుమూత

‘ప్రగతి’ నాగేశ్వర్​రావు కన్నుమూత

సారథి, రామడుగు: ప్రగతి విద్యాసంస్థల అధినేత మండవ నాగేశ్వరరావు కరోనాతో మంగళవారం సాయంత్రం గుంటూరు జిల్లా నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాగేశ్వర్ రావు స్వస్థలం గుంటూరు జిల్లా నరసరావుపేట. ఆయన 40 ఏళ్ల క్రితం రామడుగు మండలం గోపాల్ రావు పేటలో చైతన్య పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అనంతరం మరో ఉపాధ్యాయుడు రాధాకృష్ణ, గోపాల్ రావు పేట గ్రామానికి చెందిన కర్ర శ్యాంసుందర్ రెడ్డి తో కలిసి ప్రగతి విద్యాలయాన్ని ప్రారంభించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ప్రగతి పాఠశాలతో పాటు జూనియర్ డిగ్రీ, పీజీ కాలేజీలని ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. విద్యార్థులకు కేవలం విద్యనే కాకుండా ఆటాపాటలు, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి వారు రాణించేలా కృషిచేశారు. అన్ని రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దారు. వేలాది మంది విద్యార్థుల ఉజ్వల భవిష్యత్​ కు పునాది వేసిన నాగేశ్వర్​ రావు ఇక లేరు అన్న వార్త తెలిసిన విద్యార్థులు, విద్యాసంస్థల కరస్పాండెంట్ లు, శ్రేయోభిలాషులు, అభిమానులు కన్నీరుమున్నీరయ్యారు.