Breaking News

బెజ్జంకిలో లాక్ డౌన్ అంక్షలు

బెజ్జంకిలో లాక్ డౌన్ అంక్షలు

–  తీర్మాణించిన గ్రామ పాలకమండలి సభ్యులు

సారథి, సిద్దిపేట ప్రతినిధి:  కరోనా సెంకడ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:00 వరకే వర్తక, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండనున్నాయి. మధ్యాహ్నాం నుంచి మండల కేంద్రంలో లాక్ డౌన్ ఆంక్షాలు అమలు చేయాలని బెజ్జంకి గ్రామ సర్పంచి ద్యావనపల్లి మంజుల శ్రీనివాస్, గ్రామపాలకవర్గ సభ్యులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మాణం చేశారు. మండల ప్రజలు ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ఆంక్షాలను పాటించాలని ఎవ్వరైనా ఉల్లంగిస్తే జరిమానాలు విధిస్తామని ప్రజలకు గ్రామ పాలకవర్గం తెల్చిచెప్పింది.