![సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/02/KAVITHA22.jpg?fit=677%2C321&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిద్దామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. శుక్రవారం జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజల అనంతరం గ్రామోదయ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ‘కుంబ్ సందేశ్’ రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. కరోనా మహమ్మారి వంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా భారత సంప్రదాయాలు పాటించిదని గుర్తుచేశారు. సంస్కృతిని కొత్త తరానికి చేరవేయడంతో పాటు ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ్ సందేశ్ యాత్రను చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ రథయాత్ర కుంభమేళా విశిష్టతను వివరించేలా కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు సాగనుంది. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఆధ్యాత్మికవేత్త సత్యవతి తదితరులు పాల్గొన్నారు.