Breaking News

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!

నా భూమి అమ్మాలని.. భయపెడుతుండు!
  • సర్వే రిపోర్ట్​ ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడు
  • తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీపై పోలీసులకు ఫిర్యాదు

సామాజికసారథి, తెల్కపల్లి: ‘నా భూమిని అతనికి విక్రయించాలని తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వేధిస్తున్నాడు’ అని తెల్కపల్లి గ్రామానికి చెందిన సింగగాళ్ల రాములు పోలీసులను ఆశ్రయించాడు. గ్రామ సర్వే నెం.52లో తనకు ఎకరా భూమి ఉందని, 40 ఏళ్లుగా సాగులో ఉన్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమనే పక్కనే సర్వే నెంబర్​ 12, 13లో తెల్కపల్లి మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డి వెంచర్ చేసి తన ఎకరా భూమిని అతనికి అమ్మాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడని వాపోయాడు. తనకు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ రిపోర్ట్​ ఇవ్వకుండా సర్వేయర్​ ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపాడు. నరేందర్​ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. భూమి ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్న మాజీ జెడ్పీటీసీ నరేందర్​ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సింగగాళ్ల రాములు పోలీసులకు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *