Breaking News

అపోహలు వీడి టీకా వేయించుకోండి

అపోహలు వీడి టీకా వేయించుకోండి


సారథి, మానవపాడు: మానవపాడు సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి కరోనా టీకా వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆత్మ లింగారెడ్డి కోరారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్​ సవిత, హెల్త్ సూపర్ వైజర్ చంద్రన్న, ఫార్మసిస్ట్ తీరుమల్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఏఎన్​ఎం మున్ని, షాజహాన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సోని, ఆశా వర్కర్లు ఉన్నారు.