Breaking News

ఆర్మీ మాజీ జవాన్​ చిల్లర చేష్టలు!

ఆర్మీ మాజీ జవాన్​ చిల్లర చేష్టలు!
  • ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకర పోస్ట్​
  • దేహశుద్ధి చేసిన పాలెం గ్రామస్తులు
  • కౌన్సెలింగ్​ ఇచ్చి హెచ్చరించిన పోలీసులు

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని పాలెం గ్రామానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్మీ మాజీ జవాన్ ను స్థానికులు చెప్పులతో చితకబాదారు. పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు వార్నింగ్​ ఇచ్చారు. అంతకుముందు అతడి ఇంటి ముందు ఆ గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. స్థానికుల కథనం.. పాలెం గ్రామానికి చెందిన ఆర్మీ మాజీ జవాన్ దుగ్యాల వెంకటయ్య.. ఓ మాజీ ప్రజాప్రతినిధి భార్యపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్ట్​ పెట్టాడు. అది కాస్తా వైరల్​ గా మారింది. దీంతో గ్రామ మహిళలు, యువకులు పెద్దఎత్తున సదరు వ్యక్తి ఇంటిని ముట్టడించారు. చెప్పులు, చీపురుకర్రలతో చితకబాదారు. దీనికి ప్రతిగా సదరు మాజీ ఆర్మీ జవాన్ దుగ్యాల వెంకటయ్య​ భార్య పేరు పెట్టి ఎంపీపీ వర్గీయులు కూడా అదే పోస్ట్ ను వైరల్ చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన నేపథ్యంలో సదరు ఆర్మీ మాజీ జవాన్​ ను పోలీసులు పిలిచి కౌన్సెలింగ్​ ఇచ్చారు. ఎస్సై నరేందర్​ రెడ్డి సీరియస్​ గా వార్నింగ్​ ఇచ్చినట్లు తెలిసింది. మరోసారి రిపీట్​ కావొద్దని సూచించారు. సదరు మాజీ ప్రజాప్రతినిధికి మాజీ జవాన్​ దుగ్యాల వెంకటయ్య చేత సారీ చెప్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *